లక్నో: ఉత్తరప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో నేటినుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రయాగ్రాజ్లో అధికారులు రాత్రి కర్ఫ్యూ విధించారు. ఈరోజు నుంచి అది అమల్లోకి వస్తుందని ప్రకటించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. తరుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడింరు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
పట్టణంలో నిన్న ఒక్కరోజే 1076 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పట్టణంలో 2 వందలకు పైగా కరోనా హాట్స్పాట్లు ఉండటం గమనార్హం. దీంతో మహమ్మారి వ్యాప్తిని నిలువరించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈనేపథ్యంలో ప్రయాగ్రాజ్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో అలహాబాద్ 13వ స్థానంలో ఉన్నది. అలహాబాద్ జిల్లా కేంద్రం ప్రయాగ్రాజ్.
కాగా, రాష్ట్రంలో ఇప్పటికే వారణాసి, కాన్పూర్, లక్నోలో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. నేటి నుంచి ఈనెల 30 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 6023 పాజిటివ్ కేసులు నమోదవగా, 40 మంది బాధితులు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,45,930కి చేరింది. నిన్న కొత్తగా నమోదైన కేసుల్లో లక్నోలో 1333, అలహాబాద్లో 811, వారణాసిలో 593, కాన్పూర్లో 300 చొప్పున ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..