చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
69 మంది చెక్కుల పంపిణీ
కొడిమ్యాల,ఏప్రిల్ 7: దేశానికే ఆదర్శంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండల కేంద్రంలో 69 మంది కల్యాణ లక్ష్మి, షా దీముబారక్ లబ్ధిదారులకు బుధవారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. కరోనా సమయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల ను అమలు చేస్తునట్లు చెప్పారు. మండల కేంద్రం లో యాదవ సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీరప్ప ఉత్సవాలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, తహసీల్దార్ స్వర్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగరావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనుమాండ్ల రాఘవరెడ్డి, సర్పంచులు భూక్యా బొజ్జానాయక్, గరిగంటి మల్లేశం, నాయకులు నేరెళ్ల మహేశ్, బొడ్డు రమేశ్, జక్కుల మల్లేశం తదితరులున్నారు.