సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 7 : సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు ముందస్తుగా పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలి పారు. బుధవారం అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, మున్సిపల్ కమిషనర్ రమణాచారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రి య మొదలైందని, కమిషనర్ లేదా డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారన్నారు. సాధారణ ఎన్నికలకు రూపొందించిన నియమావళి, నియమ నిబంధనలు ప్రస్తుతం ఎన్నికలకు వర్తిస్తాయని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, సామగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్ పేపర్ ముద్రణ, ఇండేలిబుల్ ఇంకు ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో సీడీఎంఏ పర్యవేక్షిస్తారని వివరించారు.
జనవరి 1వ తేదీ వరకు అర్హులైన ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం జనవరి 15న ప్రచురించిందని, ఈ జాబితా ను టీఈపోల్ సర్వర్లో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటు లోకి తెచ్చిందన్నారు. ఆ జాబితాను ఉపయోగించుకొని ఏప్రిల్ 5న ముసాయిదా జాబితాను ప్రచురించామని, దీనిపై అభ్యంతరాలను పరిశీలించి ఏప్రిల్ 11న తుది ఓటరు జాబితా వార్డు వారీగా ప్రచురించాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల గుర్తింపుపై నోటిఫికేషన్ జారీ చేశామని, వీలైనంత వరకు గతంలో ఉపయోగించిన పోలింగ్ స్టేషన్లనే వాడుకోవాలని సూచించారు. ఏప్రిల్ 14న పోలింగ్ స్టేషన్ల తుదిజాబితా ప్రచురించాలన్నారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఏప్రిల్ 12వ తేదీ లోపు శిక్షణ పూర్తి చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సులకు అవసరమైన మరమ్మతులు చేయించి, సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. వార్డుల వారీగా బ్యాలెట్ పేపర్ అంచనా వేసుకొని, ప్రింటింగ్ ప్రెస్ గుర్తించాలన్నారు.
ఇవీ కూడా చదవండీ…