రంగారెడ్డి, ఏప్రిల్ 7,(నమస్తే తెలంగాణ): జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో వరద ముంపు సమస్యను పరిష్కరించేందుకుగాను రూ.348 కోట్ల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. నాలాల అభివృద్ధికి భారీ ప్రణాళికలను రూపొందించి పెద్దఎత్తున నిధులు కేటాయించడం ఇదే తొలిసారని మంత్రి పేర్కొన్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పట్టణ ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులు ఇబ్బందులకు గురైన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో వరదముంపు సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రూ.32.42 కోట్లు, ఎల్బీనగర్ నియోజకవర్గానికి రూ.113.59 కోట్లు, శేరిలింగంపల్లికి రూ.57.74 కోట్లు, మహేశ్వరానికి రూ.94.41 కోట్లు, రాజేంద్రనగర్కు రూ.50.68 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు.
వర్షపు నీరు వెళ్లేందుకు అవసరమైన కొత్త నిర్మాణాలను, కుంచించుకుపోయిన చోట్ల విస్తరణలు, నాలాల మరమ్మతులకు అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇటీవల జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో వరద పరిస్థితులను అధ్యయనం చేసి నివేదికను రూపొందించామని, సంబంధిత నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే జిల్లాలోని చెరువులు, తూములు, నాలాలను అభివృద్ధి చేసి వరద ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతామన్నారు. జిల్లాకు అధిక మొత్తంలో నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ కూడా చదవండీ..
కమల్ హాసన్ మిస్టర్ పర్ఫెక్ట్.. అప్పుడే షూటింగ్కు వచ్చేసాడు
అల్లు అర్జున్ పేరు మార్చిన సుకుమార్..
బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్పై దాడి