మోపాల్(ఖలీల్వాడి), ఏప్రిల్ 6: మోపాల్ మండలంనర్సింగ్పల్లిలో ఉన్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు మంగళవారం కన్నుల పండువగా జరిగాయి. ఇందూరు తిరుమల సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు యాగశాలలో మహా పూర్ణాహుతి అనంతరం భక్తులను ఉద్దేశించి దేవనాథ జీయర్ స్వా మి ప్రవచనాలు చేశారు.
అనంతరం స్వామి వారికి చక్ర స్నానం కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో స్వామి వారికి చక్ర స్నాన కార్యక్రమాన్ని జీయర్ స్వామి నిర్వహించారు. సాయంత్రం వేలాది పువ్వులతో శ్రీపుష్ప యాగం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం దేవనాథ జీయర్ స్వామి ప్రవచనాలు చేశా రు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దిల్ రాజు, నర్సింహారెడ్డి, శిరీశ్రెడ్డి, ప్రముఖ సీనియర్ నటుడు శరత్బాబు, హాస్య నటుడు వేణు, సర్పంచ్ సాయారెడ్డి, ఎంపీటీసీ రాములు, ఫొటో గంగాధర్, రవీందర్ యా దవ్, నర్సారెడ్డి, నరాల సుధాకర్, ప్రసాద్, రమేశ్, భాస్కర్, లక్ష్మి, మూర్తి, రాజేశ్వర్, అరుణ్, అరవింద్, భూంరెడ్డి, యజ్ఞాచార్యులు హయగ్రీవ స్వామి, కోమండురి శ్రీకర్ స్వామి, సంపత్ స్వామి, రోహిత్ స్వామి, నరసింహ మూర్తి స్వామి, కృష్ణమాచార్యులు స్వామి, ప్రశాంత్ స్వామి తదితరులు పాల్గొన్నారు.