అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. వైఎస్ వివేకానంద హంతకులను ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. తనతో ఈ మాటలు తన కొడుకు సీఎం వైఎస్ జగన్, కూతురు వైఎస్ షర్మిల అన్నారని గుర్తు చేశారు.
ఈ విషయంలో రెండో మాటే లేదని స్పష్టం చేస్తూ సోమవారం ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు విషయమై కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్నదని వైఎస్ విజయమ్మ గుర్తు చేశారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పని చేస్తున్నప్పుడు, ఈ కేసు దర్యాప్తు విషయమై ఏపీ ప్రభుత్వం చేయగలిగేది ఏమిటని ప్రశ్నించారు. తిరుపతి బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు.
వివేకాను హత్య చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షించాలనే వివేకా కుమార్తె సునీత డిమాండ్ చేస్తున్నారని విజయమ్మ గుర్తు చేశారు. ఇదే తమ కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయమని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ మద్దతు సునీతకు ఉందని పేర్కొన్నారు.
ఇటీవల ఢిల్లీలో వైఎస్ వివేకానంద రెడ్డి తనయ సునీత మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రిది రాజకీయ హత్యేనని పేర్కొన్న సంగతి తెలిసిందే. తన తండ్రి హత్యకు గురై రెండేండ్లవుతున్నా న్యాయం జరుగలేదని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
మహారాష్ట్ర కొత్త హోంమంత్రిగా పవార్కు సన్నిహితుడు
కరోనా రెండో వేవ్ ఎఫెక్ట్: షిర్డీ సాయిబాబా ఆలయం మూత!