ఆదిలాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఖమ్మం పోలీస్ కమిషనర్(సీపీ)గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్ ఎస్పీతోపాటు నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎస్పీగా కొనసాగుతున్నారు. జిల్లాలో ఆదివాసీ గిరిజనుల ఆందోళనల నేపథ్యంలో ఆయన డిసెంబర్ 16, 2017లో నియమితులయ్యారు. ఇరువర్గాలతో చర్చలు జరిపి ఆందోళనలను అదుపు చేశారు. జిల్లాలో సుదీర్ఘకాలంగా 3 ఏండ్ల 3 నెలలపాటు పనిచేశారు. ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తూనే నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి ఎస్పీగా ఆరు నెలలు విధులు నిర్వహించారు. ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చేశారు. భైంసా అల్లర్లు సమయంలో పోలీసు బృందాలతో వెంటనే చేరుకుని అదుపులోకి తీసుకొచ్చారు. జిల్లాకు కొత్త ఎస్పీగా ఇంకా ఎవరినీ ప్రభుత్వం నియమించలేదు.
ఇవి కూడా చూడండి..
హీరో సంచలనం.. ఎలక్ట్రిక్ వెహికల్స్పై మెకానిక్లకు శిక్షణ
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : మంత్రి ఈటల