కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 3 : ప్రజలను ఆలోచింపజేసేలా కవులు రచనలు చేయాలని కలెక్టర్ హరిచందన అన్నారు. ‘స్వర్ణ భారత’ అమృతోత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. కలెక్టర్ హరిచందన జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న అమృతోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఊహించిన దానికంటే ఎక్కువ మంది కవులు కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం గా ఉందన్నారు. కవిత్వాల ద్వారా జిల్లాకు మంచి పేరు తీ సుకురావాలన్నారు. పర్యావరణ, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చే అంశాలపై కవులు దృష్టి సారించాలన్నారు. నిజాయితీ, సమానత్వం పెంచే విలువలతో కూడిన జీవితాలు గడిపేలా ప్రజలను తమ రచనల ద్వారా మేల్కొలపాలన్నారు. అదనపు కలెక్టర్ చం ద్రారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర స మర యోధుల త్యాగాలు, వారి సే వా నిరతిని గూర్చి వివరించారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజాగౌడ్ మాట్లాడుతూ కవితలు విన డం తమకెంతో ఆనందాన్ని కలిగిం చిందన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను కవితల రూ పంలో తలచుకొని అభివృద్ధి పథం వైపు సాగాలని చెప్పారు. మొత్తం 47 మంది కవులు సమ్మేళనంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, ధైర్య సాహసాలు, పోరాడిన పోరాట పటిమ గురించి శ్రోతల కళ్లకు కట్టినట్లుగా కవులు కవితలతో అలరించారు.
అనంతరం ఉత్తమ కవులకు శాలువా, ప్రశంసా పత్రాలతో పాటు రూ.1,116ల నగదు పురస్కారంతో కలెక్టర్ సన్మానించారు. అదేవిధంగా కవులందరికీ ప్రశంసా పత్రా లు అందజేశారు. సమావేశంలో పేట, మక్తల్ మున్సిపల్ చైర్పర్సన్లు గందె అనసూయ, పావని, మక్తల్ మున్సిపల్ వైస్చైర్మన్ అఖిల, ఆర్డీవో వెంకటేశ్వర్లు, మహిళా శిశు సం క్షేమ శాఖ అధికారి జైపాల్రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, డీఆర్డీవో కాళిందిని, జెడ్పీ సీఈవో సిద్ధి రా మప్ప, జిల్లా అధికారులు, కవులు కృష్ణ మోహన్, తాటి నర్సప్ప, తాటి కృష్ణ, శ్రీనివాస్, రాములు, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.