న్యూఢిల్లీ: ఒకే ఏడాదిలో అత్యధిక కిలోమీటర్లు లైన్లను విద్యుదీకరించిన రికార్డును సొంతం చేసుకుంది ఇండియన్ రైల్వేస్. 2020-21 ఏడాదిలోనే రైల్వేస్ ఏకంగా 6015 రూట్ కిలోమీటర్ల సెక్షన్లను విద్యుదీకరించింది. ఇండియన్ రైల్వేస్ బ్రాడ్గేజ్ నెట్వర్క్ 63,949 కిలోమీటర్లు కాగా, 740 కిలోమీటర్ల కొంకణ్ రైల్వే లైన్ కలిపి మొత్తం 64,689 కిలోమీటర్లు ఉంది. ఇందులో మార్చి 31 నాటికి 45,881 కిలోమీటర్లలో విద్యుదీకరణ పూర్తయింది. ఈ మొత్తం 71 శాతం కావడం విశేషం.
గతేడాది కొవిడ్ ఉన్నా కూడా ఇండియన్ రైల్వేస్ ఈ రికార్డును అందుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇంతకుముందు 2018-19లో 5,276 కిలోమీటర్లతో ఉన్న రికార్డును ఇప్పుడు బద్ధలు కొట్టింది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిని తగ్గించడం, రైల్వేస్ను పర్యావరణహితంగా మార్చే ఉద్దేశంతో విద్యుదీకరణ పనులను వేగవంతం చేశారు. గత ఏడేళ్లలోనే విద్యుదీకరణ పనులు 5 రెట్లు పెరిగినట్లు రైల్వే శాఖ తెలిపింది. 2023 డిసెంబర్నాటికి మొత్తం రైల్వే లైన్ను విద్యుదీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది.
చెన్నై చేరిన డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్
గిఫ్ట్గా వచ్చిన మహీంద్రా థార్ కార్లతో నటరాజన్, శార్దూల్ పోజులు
వారణాసిలో సవాల్.. మోదీపై దీదీ పోటీ!
యూట్యూబర్ స్టంట్.. 50 గంటల పాటు సజీవ సమాధి.. వీడియో వైరల్
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్కు ఈసీ ఆదేశం
ఆ ఒక్క సిక్స్తోనే వరల్డ్కప్ గెలవలేదు: గంభీర్
టీ20 వరల్డ్కప్.. పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాలు ఇస్తారా?
డివిలియర్స్ ఆల్టైమ్ ఐపీఎల్ లెవన్ ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?