చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ప్రచారం హోరెత్తుతున్నది. మరోవైపు తమిళనాడులో అధికార అన్నాడీఎంకేకు మిత్రపక్షమైన బీజేపీ.. ప్రతిపక్ష డీఎంకే నేతలపై వరుసగా ఐటీ దాడులకు దిగుతుండటం డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. తాజాగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కుమార్తె ఇంటిపై ఐటీ అధికారులు రైడ్ చేశారు. ఈ విషయం తెలిసి తిరుచ్చిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న స్టాలిన్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మండిపడ్డారు.
తాను ఈ ఉదయం చెన్నై నుంచి తిరుచ్చి వచ్చిన కొద్దిసేపటికే చెన్నైలోని తన కుమార్తె ఇంటిపై ఐడీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందని పెరంబలూర్ సభలో స్టాలిన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకేను గట్టెక్కించడం కోసం మోదీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు. తాను మోదీకి ఒక్కటే చెప్పదల్చుకున్నానని, తాను కరుణానిధి బిడ్డను అనే సంగతి మర్చిపోవద్దని హెచ్చరించారు. బీజేపీ బెదిరింపులకు భయపడనని తేల్చిచెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆస్ట్రాజెనికా టీకా అవసరంరాదేమో : అమెరికా
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. కేజీ రూ. లక్ష
ఊర్వశి వాట్సాప్ బ్లాక్.. ఇశా నేగితో రిషబ్ డేటింగ్ !
బైడెన్ ప్రసంగంలో హోలీ ప్రస్తావన
డొనాల్డ్ ట్రంప్లా మమత తీరు: బీజేపీ
కొవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ తమిళిసై