ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతిచెందారు. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో ఒక్కరి చొప్పునచనిపోయారు.
కాశీబుగ్గ, మార్చి 31 : గ్రేటర్ పరిధి ఆరెపల్లిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్రంగా గాయాల య్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. పైడిపల్లి ప్రాంతానికి చెందిన మంద రిథిన్(20), పసునూరి అఖిల్(20) ద్విచక్రవాహనంపై వరంగల్కు వెళ్తున్నారు. ఈ క్రమం లో లారీ ఢీకొట్టడంతో మంద రిథిన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు పసునూరి అఖిల్కు రెం డు కాళ్లు విరుగగా వెంటనే దవాఖానకు తరలించారు. కాగా, 58వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన వంగపహాడ్ గ్రామ ప్రజలతో కలిసి రోడ్డుపై ధర్నా చేశా రు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డి మాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చెరువులో పడి బాలుడు..
చెన్నారావుపేట : మండల కేంద్రంలోని పాపయ్యపేట శివారు సుద్దరేవుల ఆయకట్టు చెరువులో బానోత్ భానుప్రసాద్(10) ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఖానాపూర్ మండలంలోని బండమీది మామిడితండాకు చెందిన బానోత్ బాలు – మమత దంపతుల కుమారుడు భానుప్రసాద్ చెన్నారావుపేట మండలంలోని ధర్మాతండా గ్రామ పంచాయతీ పరిధి హట్యా తండాలోని గుగులోత్ బాలు ఇంటికి వచ్చారు. స్నేహితులతో సరదాగా సుద్దరేవుల ఆనకట్టలో ఈతకు వెళ్లి లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి మరణించాడు. తోటి మిత్రులు కాపాడే ప్రయత్నించినా రక్షంచలేకపోయారు. స్థానికులు బాలుడి మృతదేహాన్ని బయటికి తీశారు. ఘ టనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై రవి అన్నారు.
విద్యుదాఘాతంతో ఒకరు..
చిట్యాల : వరికోల్పల్లి శివారు కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన మేరుగు రమేశ్ (35) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన రమేశ్ పంటకు నీరు పెట్టడానికి వెళ్లా డు. రాత్రి ఇంటికి రాకపోవడం తో కుటుంబ సభ్యులు పంట చే ను వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. మోటరు స్వి చ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశా త్తు విద్యుత్షాక్కు గురై అక్కడి కక్కడే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అతడికి భార్య ప్రణీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
టిప్పర్ ఢీకొని మహిళ..
కాటారం : కాటారం మండలంలోని 353 (సీ) జా తీయ రహదారిపై కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసర్ల ప్రమీల (43) మూడు రోజుల కిందట టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ సాంబమూర్తి తెలిపారు. సోమవారం తెల్లవారు జామున బహిర్భూమికి వెళ్లడానికి రోడ్డు పక్కన నడుస్తుండగా ఇసుక లోడుతో భూపాలపల్లి వైపు వెళ్తున్న టీఎస్19టీ-1557 నంబరు గల టిప్పర్ ఢీకొట్టగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని బంధువులు వరంగల్ ఎంజీఎం దవాఖాన కు తరలించారు. చికిత్స పొందుతూ ప్రమీల మృతి చెం దినట్లు ఎస్సై తెలిపారు. మహిళ మృతికి కారణమైన టి ప్పర్ డ్రైవర్ గాదెపు శ్రీనుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాలుజారి కిందపడి..
నెల్లికుదురు : ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై పత్తిపాక జితేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట జిల్లా మోతె మండలం నేరడాయి గ్రామానికి చెందిన పుల్లగూరి నర్సయ్య(75) ఖమ్మంలో నివాసముంటున్నాడు. చేప ల వలలు అమ్ముతూ కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వలలు అమ్మడానికు నెల్లికుదురు నుంచి పెద్ద చెరువు కట్ట మీదుగా రామన్నగూడెం వెళ్తున్నాడు. చెరువు తూము వద్ద మంచినీళ్లు తాగి పైకెక్కుతున్న క్రమంలో కాలుజారి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వెళ్లి ఆధారాలు సేకరించి అతడి బంధువులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు పుల్లగూరి పరమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
అస్వస్థతతో ఒకరు..
బయ్యారం : పీహెచ్సీలో వ్యాక్సిన్ వేసుకున్న మరునాడు అకస్మాత్తుగా ఓ వ్యక్తి చనిపోవడం కలకలం రేపింది. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తేలప్రోలు మంగయ్య(57) మంగళవారం సమీపంలోని గంధంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాడు. రాత్రి వేళ వాంతులతో ఛాతీలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఆశవర్కర్కు సమాచారమిచ్చారు. ఆమె సూచన మేరకు 108లో మహబూబాబాద్లోని ఏరియా హాస్పిటల్కు తరలించగా సుమారు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మృతిచెందాడు. అయితే కరోనా వ్యాక్సిన్ వల్లే మంగయ్య చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారులు వివరాలు సేకరిస్తున్నారు.