బీర్కూర్/నస్రుల్లాబాద్/బాన్సువాడ రూరల్/రామారెడ్డి /పిట్లం /బాన్సువాడ, మార్చి 30: యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో సీఎం చిత్రపటాలకు రైతులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు మంగళవారం క్షీరాభిషేకం నిర్వహించారు. బీర్కూర్ మండలంలోని చించోలి, బరంగేడ్గి, కిష్టాపూర్, బీర్కూర్, భైరాపూర్, వీరాపూర్ గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. యాసంగి ధాన్యాన్ని సొసైటీల ఆధ్వర్యంలో సేకరించేందుకు అనుమతులు ఇవ్వడంతో నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, విర్జాపూర్, దుర్కి, నస్రుల్లాబాద్ ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఎంపీపీ విఠల్, విండోల చైర్మన్లు పెర్క శ్రీనివాస్, గంగారాం, దివిటి శ్రీనివాస్, మారుతి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సాయిలు, మండల కో-ఆప్షన్ సభ్యుడు మాజీద్, నాయకులు ప్రతాప్, ప్రభాకర్ రెడ్డి, కంది మల్లేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
బాన్సువాడ మండలం బుడిమి సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సహకార సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ మధుసూదన్రెడ్డి, తిర్మలాపూర్ సర్పంచ్ జిన్న రఘు, గంగుల గంగారాం, గోపాల్రెడ్డి, జిన్న నామ్దేవ్, కుమ్మరి రాజు, వెంకట్రెడ్డి, నర్వ రవి, మల్లారెడ్డి, లక్ష్మాగౌడ్, రైతులు, నాయకులు పాల్గొన్నారు. రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చంద్రకళ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంచ గోపాల్రెడ్డి, స్వామిగౌడ్, శ్రీనివాస్రెడ్డి, రఘ తదితరులు పాల్గొన్నారు. పిట్లం మండలంలోని రాంపూర్ విండో వద్ద సొసైటీ అధ్యక్షుడు శపథంరెడ్డి, రైతులు సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు నారాయణరెడ్డి, సర్పంచులు పండిత్రావు, రవీందర్, నాయకులు బాబుసేట్, శంకర్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రైతుపక్షపాతి..
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి, రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఎన్ని కొర్రీలు పెట్టినప్పటికీ ముఖ్యమంత్రి అన్నదాతల పక్షానే నిలిచారని కొనియాడారు. యాసంగిలో ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించేందుకు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. బాన్సువాడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. రైతుల పక్షాన నిలిచిన సీఎం, స్పీకర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, పిట్ల శ్రీధర్, మహ్మద్ ఎజాస్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్నాయక్, మహిళా అధ్యక్షురాలు బూనేకర్ జ్యోతి ప్రకాశ్, కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, లింగమేశ్వర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొర్ల పోతురెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు గోపాల్రెడ్డి, కౌన్సిలర్ పాశం రవీందర్ రెడ్డి, సర్పంచులు నారాయణరెడ్డి, శ్రావణ్కుమార్, తుకారాం, రైతులు పాల్గొన్నారు.