వాషింగ్టన్: బారత దేశానికి వెళ్లే ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్స్ (ఓసీఐ) కార్డు గల భారత సంతతి వ్యక్తులు, ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం రిలీఫ్ ఇచ్చింది. స్వదేశానికి వెళ్లే ఓసీఐ కార్డు హోల్డర్లు.. పాత, గడువు పూర్తయిన పాస్పోర్టులను వెంట తెచ్చుకోనవసరం లేదు. ఇంతకుముందు అందరితోపాటు ఓసీఐ కార్డు దారులు కూడా తమ పాత/ గడువు పూర్తయిన పాస్పోర్టులను వెంట తెచ్చుకోవాల్సి ఉండేది. ఈ మేరకు వాషింగ్టన్లోని భారతీయ ఎంబసీ తన వెబ్సైట్లో ప్రకటన చేసింది.
ఓసీఐ కార్డుతోపాటు పాత పాస్పోర్టులను వెంట తెచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదని భారత ఎంబసీ పేర్కొన్నది. కొత్త పాస్పోర్ట్ మాత్రం వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. పాత పాస్పోర్ట్ నంబర్ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు గడువును పలు దఫాలు పొడిగించింది. ఓవర్సీస్ ఇండియన్లు ఓసీఐ కార్డులతోపాటు పాత పాస్పోర్టులను వెంట తెచ్చుకోవాలన్న మార్గదర్శకాలను కేంద్రం సడలించడం ఇదే తొలిసారి.
ఇంతకుముందు స్వదేశానికి వచ్చినప్పుడు ఓసీఐ కార్డు ఉన్నా పాత/ గడువు పూర్తయిన పాస్పోర్ట్లను వెంట తెచ్చుకోవడం ఇబ్బందికరంగా ఉందంటూ ప్రవాస భారతీయులు తమ ద్రుష్టికి తేవడంతో ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం తీసుకొచ్చింది.దీనికి తోడు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు విదేశాల్లో ఉండే భారతీయులు, ప్రవాసులు ఓసీఐ కార్డు పొందేందుకు కేంద్రం గడువు పొడిగించింది.
2005 నుంచి అమలులో ఉన్న ఓసీఐ గైడ్లైన్స్ ప్రకారం కార్డు హోల్డర్ నూతన పాస్పోర్ట్ తీసుకున్న ప్రతి సారీ ఓసీఐ కార్డు తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ నిబంధనలను గతేడాది నుంచి కేంద్రం సడలించింది.20 ఏండ్ల లోపు మొదలు 50 ఏండ్లు దాటిన వారికి మరోమారు ఓసీఐ కార్డులను కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్.. 87 శాతం సంస్థల మాట ఇదే
అప్పుపై కొనే కంటే లీజు కారు చౌక!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!