నందిగ్రామ్లో మమత భారీ రోడ్ షో
పోలింగ్దాకా ఇక్కడే: మమత
బీజేపీ కార్యకర్త తల్లి మృతి..వివాదం
నందిగ్రామ్/కోల్కతా, మార్చి 29: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో భాగంగా గురువారం నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. నందిగ్రామ్ నుంచే మమత బరిలో ఉన్నారు. ఆమె సోమవారం నందిగ్రామ్లో భారీ రోడ్ షో నిర్వహించారు. చక్రాల కుర్చీపైనే కూర్చొని టీఎంసీ సీనియర్ నేతలతో కలిసి ప్రజలకు అభివాదం తెలుపుతూ 8 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. ‘నందిగ్రామ్లో ఓటింగ్ ముగిసేదాకా ఇక్కడే ఉంటాను’ అని అన్నారు. ఇదే నియోజకవర్గంలో మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ర్యాలీ నిర్వహించనున్నారు. తృణమూల్ నుంచి వెళ్లి బీజేపీలో చేరిన సువేందు అధికారి ఇక్కడ మమతకు పోటీగా నిలబడ్డారు. ఇదిలా ఉండగా, 24 పరగణాల జిల్లాలో బీజేపీ కార్యకర్త తల్లి శోభా మజుందార్(82) మృతి రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. బీజేపీ కార్యకర్తలు పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వృద్ధురాలిపై ఫిబ్రవరి 27న టీఎంసీ గూండాలు దాడి చేశారని, చికిత్స పొందుతూ ఆమె సోమవారం చనిపోయారని శోభా మజుందార్ కుటుంబసభ్యులు తెలిపారు. దీనిని టీఎంసీ ఖండించింది. ఆమె అనారోగ్యంతో చనిపోయి ఉంటారని వెల్లడించింది.
ఇవీ కూడా చదవండి..
అత్యధిక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులున్న రాష్ట్రంగా యూపీ!
యూపీ మహిళకు సౌతాఫ్రికా స్ట్రెయిన్