హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): డెయిరీ రైతులకు పెండింగ్లో ఉన్న ప్రోత్సాహక బకాయిలను విడుదల చేసేందుకు మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు హామీ ఇచ్చారని నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్రావు తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్ను కలిసిన వారు పెండింగ్ బకాయిలపై చర్చించారు. సుమారు 60 వేల మంది రైతులకు రూ.65 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. స్పందించిన కేటీఆర్ ఈ నెల 18 తర్వాత బకాయిల విడుదలచేస్తామని హామీ ఇచ్చారని వారు వివరించారు.