హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వైద్యుడు కొవిడ్-19 పాజిటివ్ భారిన పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. గడిచిన మూడు రోజులుగా వైరస్ విస్తృతి భారీగా పెరుగుతోంది. తాజాగా కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడిగా పని చేస్తున్న విజయరాజు కరోనా భారిన పడ్డారు. వారం రోజుల క్రితమే వైద్యుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటికే మొదటి, రెండు డోసులు తీసుకున్నారు. అయినప్పటికీ వైద్యుడు కరోనా భారిన పడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఆస్పత్రి పర్యవేక్షకుడు అజయ్ కుమార్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.