రాష్ట్రవ్యాప్తంగా33 హోటళ్లలో అమలు
28 నుంచి శ్రీశైలంబ్యాక్వాటర్లోక్రూయిజ్ బోటు
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో పర్యాటకులు లేక ఇబ్బందులు పడుతున్న పర్యాటక రంగాన్ని గాడిలో పెట్టేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఇంటి వద్దే పికప్, డ్రాప్ ప్యాకేజీని తీసుకువచ్చిన టీఎస్టీడీసీ తాజాగా టూరిజం హోటళ్లలో బసచేసే పర్యాటకులకు 20 శాతం రాయితీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 హరిత హోటళ్లలో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. హోటళ్లలో అందించే ఆహారానికి మాత్రం రాయితీలు ఇవ్వడం లేదని టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా తెలిపారు. హైదరాబాద్ పర్యాటకుల కోసం ఇంటికే టూరిజం బస్సు కాన్సెప్ట్తో పాటు ‘రోడ్ టు వాటర్ టూర్’ ను రూపొందించామని చెప్పారు. ఇందుకోసం ఈ నెల 28వ తేదీన శ్రీశైలం బ్యాక్వాటర్లో క్రూయిజ్ బోటును ప్రారంభించనున్నట్లు తెలిపారు.