హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఈ-సిటీలోని స్కైవర్త్ ఎలక్ట్రానిక్స్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద రాష్ట్ర ప్రభుత్వానికి 20 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేసింది. మంగళవారం బషీర్బాగ్లోని టీఎస్ఐఐసీ కార్యాలయంలో స్కైవర్త్ మేనేజింగ్ డైరెక్టర్ రవీందర్సింగ్ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్కు కాన్సన్ట్రేటర్లను అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ ఈ వెంకటనర్సింహారెడ్డి, సీఈవో వీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.