భద్రాద్రి కొత్తగూడెం : ప్రజలందరికి మెరుగైన వైద్యం అందించేందుకు రూ.4 కోట్ల వ్యయంతో కొత్తగూడెం నియోజకవర్గంలో 20 వైద్యారోగ్యకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతి ఆరోగ్య కేంద్రంలో మూడు పడకలు ఉంటాయన్నారు. సిబ్బంది అక్కడే ఉండడం కోసం వారికి వసతి సౌకర్యమూ కల్పిస్తున్నామన్నారు. 3 వేలు నుంచి 5 వేల జనాభా ఉన్న గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పదివేల వరకు జనాభా ఉన్న ప్రాంతానికి ఒక సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
త్వరలో నీటి నిర్మాణాలు ప్రారంభమవుతాయన్నారు. సమావేశంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్స్న్ కాపు సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.