వికారాబాద్: జిల్లాలోని బొంరాస్పేట్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన సిమెంట్ లారీ కల్వర్టును ఢీకొని కిందపడిపోయింది. దీంతో లారీ డ్రైవర్ ఆనంద్ కుమార్ మరణించాడు. సిమెంట్ లోడుతో ఓ లారీ కొడంగల్ నుంచి పరిగి వెళ్తున్నది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం చౌదర్పల్లి గేట్ సమీపంలో జాతీయ రహదారిపై కల్వర్టును ఢీకొని, కింద పడిపోయింది. ప్రమాద ధాటికి లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. సిమెంట్ బస్తాలు క్యాబిన్పై పడటంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. జేసీబీ సాయంతో డ్రైవర్ను బయటకుతీశారు. 108 అంబులెన్సులో కొడంగల్ దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ డ్రైవర్ మృతిచెందాడు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతుని స్వస్థలం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా రాజాపూర్ అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.