మహబూబ్ నగర్ : దేవరకద్ర మండలం కాకతీయ స్కూల్ సమీపంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ముక్కుపచ్చలారని ఓ 20 రోజుల ఆడబిడ్డను స్థానికంగా ఉన్న వెంగమాంబ దాబా ముందు వదిలివెళ్లారు. సమాచారం అందుకున్న దేవరక్రద ఎస్ఐ భగవంత రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పసికందును దేవరకద్ర ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ పాపను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పసిబిడ్డ తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.