హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారులో భారీమోత్తంలో గంజాయి పట్టుబడింది. నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో(ఎన్సీబీ) బెంగళూరు జోనల్యూనిట్, హైదరాబాద్ సబ్ జోనల్యూనిట్ అధికారులు పెద్ద అంబర్పేట టోల్ ప్లాజా వద్ద ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏవోబీ) నుంచి మహారాష్ట్రవైపు వెళ్తున్న ఓ ట్రక్కులో రెండువేల కిలోలకు పైగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న నలుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముడి జీడిపప్పు బస్తాల మధ్య 1,080 ప్యాకెట్లలో ఒక్కో దానిలో రెండు కిలోల చొప్పు న గంజాయి దాచి ఉంచినట్టు అధికారులు తెలిపారు.