అహ్మదాబాద్: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 124 పరుగుల ఛేదనలో ఆరంభంలోనే కోల్కతా నైట్రైడర్స్కు ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ బౌలర్ల ధాటికి 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. హెన్రిక్స్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికే నితీశ్ రాణా(0) ఔటయ్యాడు. మహ్మద్ షమీ వేసిన తర్వాతి ఓవర్లో శుభ్మన్ గిల్(9) వికెట్లు ముందుదొరికిపోయాడు. హర్షదీప్ వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతికి సునీల్ నరైన్(0) ఔటయ్యాడు. వరుసగా మొదటి మూడు ఓవర్లలో వికెట్లు తీసిన పంజాబ్.. కోల్కతా బ్యాట్స్మెన్ను కళ్లుచెదిరే బంతులతో ఇబ్బంది పెడుతున్నారు. పవర్ప్లే ఆఖరికి పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి(15), ఇయాన్ మోర్గాన్(16) క్రీజులో ఉన్నారు.