హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు గ్రామాల్లో క్యాంపు లు పెట్టి, పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే క్యాంపుల్లో పాల్గొనే బృందాలకు శిక్షణ పూర్తిచేసింది. ప్రతి బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్, డాక్టర్, ఇద్దరు నర్సులు, ఒక టెక్నిషియన్ ఉంటారు. వీరితోపాటు స్థానిక ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సేవలందిస్తారు. ప్రతి గ్రామానికి వెళ్లి ర్యాండమ్గా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తారు. టెస్టింగ్ కిట్లు త్వరలో అవి అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే కరోనా టెస్టులు చేస్తారు. పాజిటివ్ కేసులతో ప్రైమరీ కాంటాక్టులు ఉన్నవారికీ పరీక్షలు చేస్తారు. మందులిచ్చి అవసరాన్ని బట్టి పెద్ద దవాఖానలకు రిఫర్ చేస్తారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అక్కడికక్కడే మందులు ఇస్తారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న జీహెచ్ఎంసీ, మేడ్చల్-మల్కాజిగిరి, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యా ల, కరీంనగర్ తదితర జిల్లాల్లో తొలివిడత క్యాంపులు ప్రారం భంకానున్నాయి. మిగతా అన్ని వ్యాధులను అదుపులోకి తేవడమే లక్ష్యంగా ఈ క్యాంపులను నిర్వహిస్తామని వైద్యాధికారులు చెప్తున్నారు.