నారాయణపేట, ఏప్రిల్ 20 : కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ వి ధించాలని నిర్ణయం తీసుకుందని, అందులో భా గంగా జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి క ర్ఫ్యూ అమలులోకి వస్తుందని ఎస్పీ డాక్టర్ చేతన అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంకులు, మీడియాకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార, వా ణిజ్య సంస్థలు, కంపెనీలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లను రాత్రి 8 గంటల లోపు మూసి వేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, మీడియా సిబ్బంది విధిగా ఐడీ కార్డులను కలిగి ఉండాలన్నారు. ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, బ స్టాండ్లకు వెళ్లే ప్రయాణికులు వ్యాలిడ్ టికెట్లను తమ వద్ద ఉంచుకోవాలని ఆమె చెప్పారు. ప్రభు త్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలతోపాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
పండుగలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
అదేవిధంగా శ్రీరామ నవమి, హనుమాన్ జ యంతి, రంజాన్ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె సూచించారు. కొ విడ్ -19 కారణంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్కు ధరించాలని, తిరిగి ఇంటికి వచ్చే వరకు మాస్కు తీయరాదన్నారు. బహిరంగ ప్రదేశాలు, మార్కెట్ల్లో ప్రజలు గుంపు లు గుంపులుగా ఉండరాదని, భౌతిక దూరం పా టించాలన్నారు. మాస్కులు ధరించని వారికి రూ. 1000 జరిమానా విధిస్తామన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అన్ని మతాల పెద్దలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పండుగలకు సం బంధించి సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.