నిజామాబాద్: జిల్లాలోని శ్రీరాంసాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 19,629 క్యూసెక్కుల నీరు వస్తున్నది. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 1071.50 అడుగుల వద్ద ఉన్నది. ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులు. శ్రీరాంసాగర్లో ప్రస్తుతం 32.061 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు.
కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతున్నది. జలాశయం జరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 811.70 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలకు గాను 35.277 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 6357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.