Telangana
- Oct 26, 2020 , 15:56:38
రఘునందన్ రావు బంధువు ఇంట్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం

సిద్దిపేట : సిద్దిపేటలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువు ఇంట్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోమవారం మధ్యాహ్నం తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా ఆ ఇంట్లో ఉన్న రూ. 18.67 లక్షలను పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు జరిపిన బంధువు ఇంటికి రఘునందన్ రావు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. 10వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
- ఈనెల 30న అఖిలపక్ష సమావేశం
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్మేళా
- భూటాన్కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
MOST READ
TRENDING