సిటీబ్యూరో, జూన్ 27 : రుతుపవనాలకు తోడు ఉపరితలద్రోణి ప్రభావంతో నగరంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యింది. మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో అత్యధికంగా 9.1 సెంటిమీటర్లు నమోదు కాగా, కుత్బుల్లాపూర్, ఆసిఫ్నగర్, సరూర్నగర్లలో అత్యల్పంగా 1 సెంటీమీటర్ వర్షం పడింది. రాబోయే మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే గరిష్టం 29.6, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 93 శాతంగా నమోదయ్యింది.