హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 173 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,63,454కు పెరిగింది. తాజాగా 315 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. 6,54,545 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,904కు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5,005 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 30,160 కొవిడ్ టెస్టులు నిర్వహించారు. తాజా కేసుల్లో అత్యధికంగా 64 జీహెచ్ఎంసీలో నమోదయ్యాయి.