స్వరాష్ట్రంలో తీరిన విద్యుత్ సమస్యలు
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్
నాగర్ నియోజకవర్గంలో రూ.18 కోట్లతో
12 సబ్స్టేషన్ల ఏర్పాటు
హాలియా, ఏప్రిల్ 10 : ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలతో జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అరకొర వచ్చే కరెంట్తోపాటు అందులోనూ లోఓల్టేజీ కారణంగా వ్యవసాయదారులు, పారిశ్రామిక వర్గాలు అష్టకష్టాలు పడ్డారు. నాడు రాత్రి మూడు గంటలు, పగలు మూడు గంటలు వచ్చే కరెంట్తో నీరందక పొలాలు ఎండిపోయేవి. నాణ్యమైన కరెంట్ లేక మోటర్లు కాలిపోయేవి. ఎండాకాలంలో అయితే మధ్యాహ్నం మొత్తం కరెంటే ఉండకపోయేది. దీంతో ఇంట్లో జనాలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యేవారు. స్వరాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తీరాయి. సీఎం కేసీఆర్ అందరి అవసరాలకు తగిన కరెంట్ను అందిస్తున్నారు. ఇప్పుడు 24 గంటలూ కరెంట్ సరఫరా అవుతున్నది. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ను ఇస్తున్నారు. సబ్స్టేషన్లు, స్తంభాలు, లైట్ల ఏర్పాటుతో ప్రతి పట్టణం, పల్లె విద్యుత్ వెలుగులతో కాంతులీనుతున్నాయి.
నందికొండలో రూ.2 కోట్లతో..
నందికొండలోని హిల్కాలనీ, పైలాన్ కాలనీలో లోఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం రూ.2 కోట్లతో కొత్తగా విద్యుత్ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. పక్కనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉన్నా ఇక్కడి ప్రజలకు ఎన్నో ఏండ్లుగా అరకొర కరెంటే అందగా ఈ సబ్స్టేషన్తో ఆ సమస్య తీరింది.
ఇవి కూడా చదవండి
జమ్మూకశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
మాస్క్ ధరించకపోతే వెయ్యి జరిమానా