హైదరాబాద్: మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయన్నే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తమ వంతుకోసం లైన్లలో నిలబడ్డారు. దీంతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదయింది. అదేవిధంగా అచ్చంపేటలో 11 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 15 శాతం, నకిరేకల్లో 11.12 శాతం, జడ్చర్లలో 12 శాతం, ఖమ్మం కార్పొరేషన్లో 15.23 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ఖమ్మం కార్పొరేషన్, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలలో ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. వీటితోపాటు మెట్పల్లి, అలంపూర్, జల్పల్లి, గజ్వేల్, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక జరుగుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..