మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడులో ఆదివారం పదుల సంఖ్యలో పాముపిల్లలు కనిపించడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన మహ్మద్ మైబెల్లి ఇంటి పక్కనున్న రాతికొట్టం నుంచి పాము ఇంట్లోకి వచ్చింది. గమనించిన స్థానికులు ఆ పామును చంపారు. అది ఎక్కడినుంచి వచ్చిందని ఆరా తీస్తున్న క్రమంలో సుమారు 70 పాము పిల్లలు బయటపడ్డాయి. – నెల్లికుదురు