మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతున్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతోపాటు నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో జూరాలకు లక్షా 5 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి 89,814 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం ప్రాజెక్టులో 318.08 మీటర్ల వద్ద ఉన్నది. జలాశయం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా, 8.77 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. శ్రీశైలం వైపు 88,051 క్యూసెక్కుల నీరు వెళ్తున్నది.