నిర్మల్ అర్బన్, ఆగస్టు 2: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని గోదావరి ఒడ్డున వెలసిన టెంబరేని గ్రామం రెండు వేల సంవత్సరాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిందని చరిత్ర పరిశోధకులు తుమ్మల దేవరావు, అబ్బడి రాజేశ్వర్రెడ్డి సోమవారం తెలిపారు. శాతవాహన కాలం నాటి మట్టి కోటను గుర్తించడమే కాకుండా 12వ శతాబ్దపు ప్రాచీన విగ్రహాలు ఈ ప్రాంతంలో వెలుగులోకి రావడం విశేషమని వారు పేర్కొన్నారు. ఈ గ్రామానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని, రాష్ట కూటులు, కల్యాణి చాళుక్యులు, కాకతీయుల పలుకుబడిలో చెక్కిన విగ్రహ ప్రతిమలను గుర్తించామన్నారు. నాడు పాత గ్రామంలో పనికి ఆహార పథకంలో భాగంగా మట్టిని తవ్వుతున్నప్పుడు శ్రీ చక్రాకృతిలో ఉన్న లింగాలు, ద్వార పాలకులు, పాలకురాలి ప్రతిమలు వెలుగు చూశాయని తెలిపారు.