నందిపేట్, ఏప్రిల్ 5 :పల్లె ప్రకృతి వనం పచ్చదనంతో కళకళలాడుతున్నది.. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో హరితదారిగా మారింది. పకడ్బందీ పారిశుద్ధ్య నిర్వహణతో స్వచ్ఛతవైపు అడుగులు వేస్తున్నది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని బాద్గుణ గ్రామం పల్లె ప్రగతి పనులన్నీ పూర్తి చేసుకోవడంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. బాద్గుణ గ్రామం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురై కొత్తగా ఏర్పడింది. అయినప్పటికీ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. మాయాపూర్ గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు అందానిస్తున్నాయి. ప్రభుత్వం అందించిన ట్రాక్టర్ ద్వారా నిత్యం నీటిని అందిస్తుండడంతో స్వల్పకాలంలోనే ఏపుగా పెరిగాయి. గ్రామంలో సకల సౌకర్యాలతో వైకుంఠధామం నిర్మించుకున్నారు.
పల్లె ప్రకృతి వనంలో రకరకాల పండ్లు, పూలు, నీడ నిచ్చే మొక్కలను నాటారు. ఆంధ్రా ప్రాంతం నుంచి ప్రత్యేకంగా తె ప్పించి నాటిన మొక్క లు పార్కుకే అందాన్ని తెచ్చాయి. పార్కుకు స్వాగత తోరణం ఏ ర్పాటు చేశారు. పార్కులో వాకింగ్ ట్రాక్, సే ద తీరడానికి బెంచీలను ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతిరోజూ గ్రామంలోని రోడ్లను పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించడంతో పాటు చెత్తను ట్రాక్టర్ సహాయంతో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలోని పాత స్తంభాలను, వైర్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ మురికినీరు నిల్వ కుండా చర్యలు చేపడుతున్నారు. విశాలమైన స్థలంలో వైకుంఠధామం నిర్మించారు. చుట్టూ మొక్కలను నాటించారు. స్నానాల గదులు, బర్నింగ్ పాయింట్, కార్యక్రమాలు నిర్వహించడానికి స్టేజీలను నిర్మించారు.
ప్రణాళికతో ముందుకు పోతున్నాం..
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రణాళికతో ముందుకు పోతున్నాం. ప్రభుత్వం పుష్కలంగా నిధులు కే టాయించడంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రా మంలో నాటిన మొక్కలను సంరక్షించడానికి చర్యలు తీసుకుంటు న్నాం. గ్రామస్తులు, వార్డు సభ్యుల సహకారంతో మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం.
-చిట్టెడి భోజారెడ్డి, సర్పంచ్
ఇవీ కూడా చదవండి…