హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): గీత కార్మికులకు ప్రమా ద బీమా పరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీచేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నిధుల నుంచి రూ.11.46 కోట్ల విడుదలకు అనుమతిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సంతో షం వ్యక్తంచేశారు. ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగవైకల్యానికి గురైన గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదలచేయాలని కోరిన వెంటనే చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. 2019 ఏప్రిల్ 1 నుంచి 2021 ఏప్రిల్ 30 మధ్య కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 90 మంది గీత కార్మికుల కుటుంబాలతోపాటు శాశ్వత అంగవైకల్యం పొందిన 109 మందికి, తీవ్రంగా గాయపడిన 225 మందికి ఈ ఎక్స్గ్రేషియాతో ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. బాధిత కుటుంబాలకు వారం రోజుల్లోనే ఈ సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్కు సన్మానం
గీత కార్మికులకు ప్రమాద బీమా పరిహారం విడుదలయ్యేందుకు కృషి చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్కు రాష్ట్ర గౌడ సంఘం ఐక్య సాధన సమితి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. రవీంద్రభారతి కార్యాలయంలో బుధవారం మంత్రిని కలిసి దుశ్శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు తాటికొండ విక్రమ్గౌడ్, పొన్నం దేవరాజ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.