హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్లోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 30న రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది.
ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం గంటల వరకు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, క్లబులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్వులను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. ఇక్కడ బీజేపీ నుంచి కార్పొరేటర్గా గెలిచిన రమేశ్గౌడ్ ప్రమాణం స్వీకారం చేయకుండానే కరోనాతో మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలో బృందం ఇటీవల కేటీఆర్ను ప్రగతి భవన్లో కలిసి విజ్ఞప్తి చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి