హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విజయ పాడి రైతుల సంక్షేమం కోసం రూ.10 కోట్ల విలువైన వివిధ పథకాల అమలుకు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ (విజయ డెయిరీ) ఆమోదం తెలిపింది. సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన మంగళవారం డైరెక్టర్ల బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు పాడి పశువుల కొనుగోలుకు రూ.10 వేలు సబ్సిడీ అందించాలని నిర్ణయించారు. ఒక్కో పాడిపశువుకు రూ. 1,000 చొప్పున బీమా అందించడంతోపాటు పశువులకు సంస్థ ద్వారా కృత్రిమ గర్భధారణ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. సబ్సిడీపై పశువుల దాణాను పంపిణీ, విజయ పాడి రైతులకు పెండ్లికానుకగా రూ.5వేలు, దురదృష్టవశాత్తూ రైతులెవరైనా మరణిస్తే అంతిమ సంస్కారాలకు రూ.5 వేలు అందించాలని నిర్ణయించారు. విజయ డెయిరీకి ఎక్కువ పాలు పోసేవారిని ప్రోత్సహించేందుకు రూ. 2,116 నగదు, సంస్థకు రోజూ 1,500 లీటర్ల కంటే ఎక్కువ పాలు పోసే డెయిరీ ఫామ్లకు గడ్డి యం త్రాలు, పాలక్యాన్లు, విద్యుత్తు సబ్సిడీ, రాయితీపై దాణా, మినరల్ మిక్చర్, ఇన్సూరెన్స్ సబ్సిడీ అందించాలని సమావేశం నిర్ణయించింది. సంస్థ అధికారులు, సిబ్బందికి పీఆర్సీ అమలుతోపాటు పదవీ విరమణ వయోపరిమితిని 58 నుంచి 61 ఏండ్లకు పెం చాలని నిర్ణయించారు. పాడి రైతుల పిల్లలకు కొత్తగా విజయ విద్యా కానుక పథకంతో పాటు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థికి రూ. 1,000, పలుపరీక్షల్లో సత్తాచాటినవారికి నగదు, ప్రశంసాపత్రం అందించాలని నిర్ణయించారు.