సూర్యాపేట : జిల్లాలోని కసరబాద్ గ్రామంలో 100 పాములు లభ్యమయ్యాయి. ఈ పాములన్నీ ఒకే చోట లభ్యం కావడంతో ఓ వ్యక్తి షాక్కు గురయ్యాడు. చింత లింగయ్య అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా 100 పాములు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని పాములను చూశారు.