వేములవాడ, మే 27: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వంద పడకల దవాఖాన సిద్ధమైంది. కరోనా వైద్యానికి తొలివిడతగా అన్నిరకాల వసతులు, వైద్య పరికరాలతో 50 బెడ్లు సిద్ధంచేశారు. మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్లో నాలుగున్నర ఎకరాల స్థలంలో రూ.20 కోట్ల వ్యయం తో దీన్ని నిర్మించారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా శుక్రవారం దవా ఖాన ప్రారంభోత్సవానికి అధికార యం త్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.