ఉయ్యాలే ఉరితాడై బాలిక మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఉల్లాసంగా ఆడుకునే ఉయ్యాలే ఆ బాలిక పాలిట యమపాశమైంది. పదేళ్ల నిండకుండానే నూరేళ్ల ఆయుష్షు తీసింది. ఉయ్యాల ఊగుతుండగా తాగు మెడకు చుట్టుకొని బాలిక మృతి చెందింది. కాగజ్నగర్ మండలం నజ్రుల్నగర్ గ్రామం నెంబర్ 9లో బుధవారం ఈ హృదయ విదారక ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. నజ్రుల్నగర్ గ్రామం నెంబర్ 9కు చెందిన సమర్ సర్కార్, బబితా సర్కార్ దంపతులకు నలుగురు కూతుళ్లు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
బుధవారం ఉదయం పెద్దకుమార్తెను తీసుకొని తల్లిదండ్రులు పొలం వెళ్లారు. రెండోకుమార్తె రియాసర్కార్ (10) ఇంటి వద్ద ఉండి ఇద్దరు చెల్లెలను ఆడిస్తోంది. మధ్యాహ్నం బాలిక ఊయల ఊగుతుండగా తిరగబడి తాడు మెడకు చుట్టుకుపోయి బిగిసుకొని మృతిచెందింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు మృతిచెందిన విషయం తెలుసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రామునిపట్ల వద్ద రెండు బైక్లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
- తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి