వాషింగ్టన్: భారత్లో వైద్యారోగ్య రంగం కోసం ఇండియన్ అమెరికన్ దంపతులు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. బిహార్, ఝార్ఖండ్లో హెల్త్కేర్ అభివృద్ధికి రమేశ్, కల్పనా భాటియా దంపతులు కోటి విరాళంగా అందజేశారని బిహార్- ఝార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(బీజేఏఎన్ఏ) తెలిపింది. ఈ నిధులను రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యరంగం అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు. పట్నా ఎన్ఐటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన కల్పనా టెక్సాస్లో వ్యాపార రంగంలో విజయవంతంగా కొనసాగుతున్నారు. రమేశ్, కల్పనా ఉదార స్వభావం వల్లే రెండు రాష్ట్రాల వైద్యరంగానికి ఈ భారీ విరాళం దక్కినట్లు బీజేఏఎన్ఏ అధ్యక్షుడు అవినాష్ గుప్తా పేర్కొన్నారు.