హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు చెందిన హోంగార్డు రమేశ్ వైద్య ఖర్చుల నిమిత్తం డీజీపీ ఎం మహేందర్రెడ్డి రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఈ నెల ఒకటిన రమేశ్ రోడ్డు ప్రమాదానికి గురై కామినేని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. డీజీపీ మంజూరు చేసిన రూ.10 లక్షలను సోమవారం దవాఖానలో ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో ఖాజా మొయినుద్దీన్ అందజేశారు. ఈ విషయాన్ని రాచకొండ సీపీ మహేశ్భగవత్ సోమవారం ట్వీట్ చేశారు.