హైదరాబాద్: సికింద్రాబాద్ డివిజన్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్)లో స్పెషలిస్ట్ డాక్టర్, కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టిషనర్, నర్సింగ్ సిస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఈనెల 27 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిప్రదికన భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 60
ఇందులో స్పెషలిస్ట్ డాక్టర్ 1, మెడికల్ ప్రాక్టిషనర్లు 13, నర్సింగ్ సిస్టర్ 21, ఫార్మసిస్ట్ 2, హాస్పిటల్ అటెండెంట్ 23 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: స్పెషలిస్ట్ పోస్టుకు ఎంబీబీఎస్తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ, ప్రాక్టిషనర్కు ఎంబీబీఎస్, నర్స్ పోస్టుకు జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్, ఫార్మసిస్ట్ పోస్టుకు ఫార్మసీలో డిప్లొమా లేదా బీఫార్మసీ, అటెండెంట్లకు పదో తరగతి లేదా ఐటీఐ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: టెలిఫోనిక్ లేదా ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం తెలియజేస్తారు.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 27
వెబ్సైట్: www.scr.indianrailways.gov.in.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..