బాసర గోదావరిపై మరో వంతెన నిర్మించే అవకాశం
ఇక మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు ప్రయాణం సులభం
ఇప్పటికే జిల్లా నుంచి వెళ్తున్న ఎన్హెచ్-44
ఆదిలాబాద్, మార్చి 26 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిర్మల్ జిల్లా గుండా మరో జాతీయ రహదారి నిర్మాణం కానుంది. మెదక్ నుంచి భైంసా వరకు ఈ ఎన్హెచ్ నిర్మించనుండగా, జిల్లాలో 28 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఇప్పటికే హైదరాబాద్ – నాగ్పూర్ జాతీయ రహదారి 44 నంబర్ 120 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నిర్మల్ జి ల్లాలో ఈ రోడ్డు 40 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దేశం లో ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ర్టాలకు పోయే వాహనాలు ఈ రోడ్డుపై నుంచే వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్- నాగ్పూర్ హైవేపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్యాసింజర్, గూడ్స్, ఇతర వాహనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాట క, కేరళ రాష్ర్టాలకు వెళ్తుంటాయి. వందలాది వాహనాలతో ఈ రహదారి రద్దీగా ఉంటుంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా ల్లో విస్తరించి ఉన్న ఈ రహదారితో జిల్లా ప్రజలకు కూడా రవాణా పరమైన సౌకర్యం కలుగడంతో పాటు రోడ్డుపై ఉం డే గ్రామాల ప్రజలు హోటళ్లు, ఇతర దుకాణాల సముదాయాలు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్- నాగ్పూర్ జాతీయ రహదారిపై పారిశ్రామిక కారిడార్ ఏర్పాట్లు జరుగుతుండడంతో రెండు జిల్లాల ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి.
కొత్తగా మరో జాతీయ రహదారి
తెలంగాణ ఎంపీల కృషిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెం డు జాతీయ రహదారులకు అనుమతులిచ్చింది. మెదక్ నుంచి భైంసా వరకు 168 కిలోమీటర్లు జాతీయ రహదారిని నిర్మించడానికి అంగీకరించింది. దీంతో నిర్మల్ జిల్లాలోని బాసర నుంచి భైంసా వరకు కొత్తగా 28 కిలోమీటర్ల నాలుగు వరుసల నేషనల్ హైవే ఏర్పాటు కానుంది. బాసరలో గోదావరిపై మరో వంతెనను కూడా నిర్మించనుండడం తో బాసరకు వచ్చే భక్తులు ఓ వంతెనపై నుంచి రావడానికి మరో వంతెన పై నుంచి పోవడానికి అవకాశాలుంటాయి. జిల్లాలోని బాసర, బిద్రెల్లి, టాక్లీ, ముథోల్, తరోడ, దహె గాం, భైంసా గ్రామాల మీదుగా ఈ రహదారి నిర్మించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచి మహారాష్ట్రలోని భోకర్, నాందేడ్, ధర్మాబాద్కు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుంది. మన రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు సరుకుల రవాణా సులభంగా జరగడంతో పాటు రైతులు పంటలను కూడా పక్కరాష్ర్టానికి తీసుకుపోయి విక్రయించవచ్చు. రాష్ర్టానికి చెందిన ప్రజాప్రతినిధుల చొరవతో మంజూరైన జాతీయ రహదారి పై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉంది..
బాసర, మార్చి 26 : బాసర గ్రామం గుండా జాతీయ రహదారి రా వడం సంతోషంగా ఉంది. కాగా ఇప్పటికే గోదావరిపై బ్రిడ్జి ఉన్నది. ఇప్పుడు జాతీయరహదారిలో భాగంగా మరో వంతెన నిర్మించడం ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయి
శ్రీనివాస్యాదవ్, బాసర
ప్రమాదాలు తగ్గుతాయి..
బాసర, మార్చి 26 : నేను వృత్తిరీ త్యా డ్రైవర్ను. తరచూ బాసరకు భక్తులను తీసుకువస్తుంటాను. ని త్యం బాసరకు భక్తులు రద్దీ ఉం టుంది. కాగా మెదక్ నుంచి భైంసా వరకు జాతీయ రహదారి నిర్మాణంతో రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి.