హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్లో మార్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెథడ్స్ను రద్దుచేసి, అందరికీ ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా, తాజాగా బీబీఏ కోర్సు చదివినవారు కూడా బీఈడీలో చేరేందుకు అనుమతివ్వాలని నిర్ణయించారు. ఎడ్సెట్లో మార్పులపై ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు న్యాయశాఖను ఉన్నత విద్యా మండలి అధికారులు సంప్రదించారు. న్యాయశాఖ కూడా ఒకే చెప్పడంతో మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యాశాఖ ఎడ్సెట్ ప్రవేశాల కోసం గతంలో జారీచేసిన జీవో-13ను సవరించి కొత్త జీవో జారీచేయాల్సి ఉన్నది. ఆ జీవో రాగానే ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తున్నారు.
మార్పులివే..