హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులకు కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్సీ) అండగా నిలుస్తున్నాయి. వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసుకునే సామర్థ్యంలేని రైతులకు వీటిద్వారా తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందుతున్నాయి. ఈ సేవలు అందించడంలో ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని సీహెచ్సీ జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. వ్యవసాయంలో యాంత్రీకరణ బాగా పెరిగింది. వీటిద్వారా పనులు సులభతరం కావడంతోపాటు, కూలీల కొరత తీరుతున్నది. అయితే, రాష్ట్రంలో 95 శాతానికిపైగా సన్న, చిన్నకారు రైతులు ఉండటంతో వారు వ్యవసాయ పరికరాలు, యంత్రాలను కొనుగోలు చేయలేకపోతున్నారు. అలాంటి రైతుల కోసం ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీల ఆధ్వర్యంలో సీహెచ్సీలను ఏర్పాటుచేస్తున్నది. ఈ కేంద్రాల ద్వారా వ్యవసాయ పరికరాలు, యంత్రాలను రైతులకు తక్కువ ధరకు అద్దెకు ఇస్తున్నారు. సెంటర్లకు ఫోన్చేస్తే పొలం వద్దకే యంత్రాన్ని చేరుస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సాగయ్యే పంటలకు అనుగుణంగా యంత్రాలు అందుబాటులో ఉంటున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ కింద మహిళలు విజయవంతంగా నడిపిస్తున్న వాటిలో దేశవ్యాప్తంగా 75 కార్యక్రమాలను ఎంపిక చేయగా అందులో తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలంలోని సీహెచ్సీ ఎంపికయింది. మరో కేటగిరిలో రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి విలేజ్ లెవల్ ప్రొక్యూర్మెంట్ సెంటర్కు కూడా స్థానం దక్కింది.
మరో 100 కేంద్రాల ఏర్పాటు దిశగా..
రాష్ట్రంలో ఇప్పటివరకు 52 సీహెచ్సీలు ఏర్పాటయ్యాయి. వీటిలో 32 సీహెచ్సీలను పూర్తిగ్రాంట్గా రూ.8.10 కోట్లతో, 20 కేంద్రాలను రూ.3.53 కోట్లతో స్త్రీనిధి, బ్యాంకుల రుణసహాయంతో ఏర్పాటుచేశారు. వీటికి అదనంగా 2021-22లో 25% గ్రాంట్తో 100 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన 75 శాతాన్ని రూర్బన్ ద్వారా కానీ, ట్రైకార్ సంస్థ, పీఎంకేఎస్వై, స్త్రీనిధి సంస్థల ద్వారాకానీ నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
అందుబాటులో ఆధునిక యంత్రాలు
రైతుల నుంచి మంచి స్పందన రావడంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త యంత్రాలు, పరికరాలను అందుబాటులో ఉంచుతున్నారు. ట్రాక్టర్, కల్టివేటర్, హార్వెస్టర్, కలుపు తీసే యంత్రాలు, గడ్డి కట్టలు కట్టే యంత్రం, రీపర్, నూర్పిడి పరికరాలు, రోటోవేటర్, స్ప్రేయర్లు ఇలా రకరకాల పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. ముందే బుక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉన్నది. రైతులు ఫోన్ చేస్తే రైతు పొలం వద్దకే యంత్రాన్ని చేరుస్తారు. గ్రామంలో వీవోఏ లేదా సీసీల ద్వారా రైతులు సమాచారం అందించవచ్చు. ఎఫ్పీసీలను బలోపేతం చేయడంలో భాగంగా ఏర్పాటుచేసిన వీటి నిర్వహణకు సెర్ప్ అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. రైతులు అద్దెను ఒకేసారి చెల్లించే స్థాయి లేకుంటే ముందుగా కొద్దిమొత్తం చెల్లించి.. మిగిలినది పంట దిగుబడి వచ్చాక చెల్లించే వెసులుబాటు కూడా కల్పించారు.
రైతులకు ఉపయోగం
సీహెచ్సీలు రైతులకు మంచిగా ఉపయోగపడుతున్నాయి. ఏడాదిగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం. రైతులు అడిగిన వెంటనే యంత్రాలను పంపిస్తున్నాం. తక్కువ ధరకు అద్దెకిచ్చినా మంచి లాభాలే వస్తున్నాయి. యంత్రాల కోసం షెడ్డు నిర్మిస్తున్నాం. సీజన్లో డ్రైవర్లను పెట్టుకుంటున్నాం.
తక్కువకే అద్దెకిస్తున్నాం
ఎఫ్పీసీ ద్వారా విత్తనాలు, ఎరువు లు సరఫరా చేస్తున్నా రు. బెనిషాన్ ద్వారా పండించిన పంటల ను కొనుగోలు చేస్తున్నారు. అవసరమైన యంత్రాలను సీహెచ్సీ ద్వారా తక్కువ ధరకు ఇస్తున్నారు. ఇంతకంటే రైతుకు ఏం కావాలి? 15 రోజులకోసారి సమావేశం పెట్టి యంత్రాలను ఉ పయోగించుకోవడంపై వివరిస్తున్నాం.
సిరిధాన్యాలకు యంత్రాలు
రైతులకు అవసరమైన 20 రకాల పరికరాలను అందుబాటులో ఉంచాం. సాధారణ పంటలతోపాటు సిరిధాన్యాలకు ప్రత్యేక యంత్రాలను కొన్నాం. యం త్రాలను ఉంచేందుకు అనంతగిరి రైతు సేవాకేంద్రంలో షెడ్డు నిర్మించాం. ప్రభు త్వం ఇచ్చిన నిధులతోపాటు పీఎంకేఎస్వై నుంచి కలెక్టర్ కేటాయించారు.
-ఎస్ శ్రీనివాస్, డీపీఎం,వికారాబాద్ జిల్లా