హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది అని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నామని డీజీపీ తెలిపారు. ప్రధాన ప్రాంతాల్లో ఉన్నతస్థాయి అధికారులతో పర్యవేక్షణ జరుగుతుందన్నారు. పోలీసు స్టేషన్లకు సీసీటీవీ కెమెరాలు అనుసంధానం చేశామన్నారు.
వీలైనంత త్వరగా నిమజ్జనం ముగిసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పది అడుగుల లోపు ఎత్తు ఉన్న విగ్రహాలను ఎన్టీఆర్, పీవీ మార్గ్ వైపు, పది అడుగుల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.