మహబూబాబాద్ : పేదలను అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. గురువారం మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నెల్లికుదురు మండలంలోని లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
కరోనా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలి. మాస్కులు ధరించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, గోగుల రాజు, సుదగాని మురళి, నాయిని రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్టైమ్ పని చేస్తున్నాం: చైనా
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి