హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని న్యాయవాదులకు లాక్డౌన్ నిబంధనల నుంచి మరికొంత మినహాయింపు ఇచ్చింది. హైకోర్టు, ఇతర దిగువ కోర్టుల్లో విధులకు హాజరయ్యేందుకు వీలుగా లాయర్లకు మధ్యా హ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తూ సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో విధులకు హాజరయ్యే న్యాయవాదులకు ప్రత్యేకంగా ఈ-పాస్లు జారీచేస్తామని డీజీపీ ఎం మహేందర్రెడ్డి తెలిపారు. సంబంధిత పోలీస్ కమిషనరేట్లు, జిల్లా ఎస్పీలు జారీచేసే ఈ-పాస్ల కోసం policeportal.tspolice.gov.in అనే వెబ్సైట్ ద్వారా న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.